నల్లమలలో పర్యటించేందుకు అనుమతివ్వండి
ప్రభుత్వం నల్లమల అడవుల్లో చేపట్టిన యురేనియం మైనింగ్ తవ్వకాల పరిసర ప్రాంతాల్లో పర్యటించేందుకు.. రాజకీయ పార్టీలకు , ప్రజాసంఘాలకు అనుమతిని ఇవ్వాలంటూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం రాష్ట్ర డీజీపీని కలసి విజ్ఞప్తి చేశారు.
యురేనియం మైనింగ్ తవ్వకాలపై వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానికుల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్లిన కోదండరాంను అచ్చంపేట పోలీసులు హజీపూర్ వద్ద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.