భారత కార్మికోద్యమ వేగుచుక్క CITU ఆర్టీసీ SWF జి. కృష్ణయ్య 5వ వర్ధంతి సభ.
అచ్చంపేట ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకుడు జి.కృష్ణయ్య 5 వ వర్ధంతి సందర్భంగ స్మారక సెమినార్ జరిగింది. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి. రవీందర్ మాట్లాడుతూ భారత దేశ కార్మికోద్యమం లో CITU విశిష్ట పాత్ర పోషించింది.
భారత దేశం లో సంఘటిత కార్మికోద్యమానికి వందేళ్లు పూర్తి ఐన సందర్బంగా కార్మికోద్యమం లో పోరాడిన నాయకులను స్మరించుకున్నారు. దేశం లో కార్మికుల హక్కులు ధ్వంసమై పోతున్నాయి అని పెట్టుబడి దారులకు అనుకూల చట్టాలు తయారవుతున్నాయి అని అయన అన్నారు. ఆర్టీసీ వేతనాలకు సంభందించిన హామీ ఒప్పందం పూర్తి ఐ 25 నెలలు గడిచిపోయిందని ఐన యాజమాన్యం నుండి గని ప్రభుత్వం నుండి గని కొత్తవేతనాల గురించి ఎలాంటి స్పందన లేదని అయన వాపోయారు. మరియు ఏడూ సంవత్సరాలనుండి నుండి కొత్త రిక్రూయిట్మెంట్ లేక సిబ్బంది పై అదనపు భారం పడుతుందని అయన ఆరోపించారు.
ఈ సందర్బంగా దేశమంతా ఆర్టీసీ కార్మికుల ఐక్యత పోరాటాలు అవసరమని పి. రవీందర్ సూచించారు
ఈ సమావేశం కు ఈ. మనోహర్ అధ్యక్షత ను వహించగా జి. పర్వతాలు, ఎం. ప్రభాకర్, ఎస్. వెంకటయ్య, జె. గోపాల్ . ఎంబి. లక్ష్మి, పి. బాలయ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.