అచ్చంపేట, మే 12, 2026: నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన అర్హులైన గిరిజన బాలబాలికలకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ (బేగంపేట, రామంతపూర్)లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీ ఎం. ఫిరంగి తెలిపారు.
ప్రవేశ వివరాలు: ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తులను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లోని గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం (రూమ్ నెం. F27)లో పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను మే 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి.
అర్హతలు:
విద్యార్థులు 01-06-2019 నుండి 31-05-2020 మధ్య జన్మించి ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షలలోపు ఉండాలి.
మే 22వ తేదీ ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తుతో పాటు నివాస, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి జతపరచాలని అధికారులు సూచించారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com