హైదరాబాద్లో వైద్యులను వెంటాడుతున్న వైరస్..68 డాక్టర్లకు పాజిటివ్

telangana covid19 positive doctors
తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. సాధారణ ప్రజలు, వైద్యులు అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతోంది. రాష్ట్రంలో కరోనా బారిన పడిన డాక్టర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉస్మానియాలో41 మంది డాక్టర్లు, గాంధీలో నలుగురు డాక్టర్లు కరోనా బారినపడ్డారు. నిమ్స్లో 12 మంది డాక్టర్లు, 8 మంది పారమెడికల్ స్టాఫ్ కరోనా బారినపడ్డారు. అలాగే డెంటల్ విద్యార్థులు ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం 68 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
Hyderabad doctors with covid19

ఇదిలా ఉంటే తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు ఇవ్వడం వల్లనే కరోనా వైరస్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు లాక్డౌన్ సమయంలో ఏప్రిల్ 9 నుంచి మే 5 వరకు 418 కేసులు మాత్రమే రాష్ట్రంలో నమోదవ్వగా.. లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన మే 6 నుంచి జూన్ 4వరకు 1830 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు తొలి విడత లాక్డౌన్లో 396, రెండో విడత లాక్డౌన్లో 418 కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. ఇక జూన్ 8 నుంచి రాష్ట్రంలో మరిన్ని సడలింపులు అమల్లోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏ స్థాయిలో పెరిగుతుందోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad doctors with covid19
అదేవిధంగా కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు.
కరోనా మహమ్మారి కంటికి కనిపించని శత్రువు అది గాలిలో ఉంటుంది తినే పదార్తల మీద, వస్తువులమీద, ఇక్కడ అక్కడ అని కాదు పరిసల చుట్టూ ఉంటుంది. ఈ మహమ్మారి బారిన పడకూడని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలో నుండి వేరే గ్రామానికి మరియు ఇతర దూర ప్రాంతాలకు మరియు తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లకూడని తెలియని వ్యక్తులతో కరచాలనం చేయకూడని నియోజక వర్గ ప్రజలకు సూచిస్తున్నారు.దీని బారిన ముక్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఎక్కువగా పడుతున్నారు అని వారిని కాపాడుకునే భాద్యత ఇంటిలోని వారిది తెలియ చేసారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin