నకిలీ పురుగు మందుల ముఠా అరెస్టు duplicate pesticides in warangal

ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్నదాతలను మోసం చేస్తూ పెద్ద మొత్తంలో నకిలీ పురుగు మందులను duplicate pesticides in warangal విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ మరియు మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. వీరి నుండి సుమారు సుమారు 34 లక్షల రూపాయల విలువగల వివిధ కంపెనీల పేర్ల కలిగి వున్న నకిలీ పురుగు మందులతో పాటు, రెండు కార్లు, ఐదు సెల్ఫోన్లు, నకిలీ పురుగు మందు లేబుల్లను పోలీసులు duplicate pesticides in warangal స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారి వివరాలు: 1. పిల్ల నాగవెంకట రంగారావు (41),కుషాయిగూడ,
హైదరాబాద్, 2. ముద్దంగుల ఆదిత్య (32), లక్షీకాపూల్, హైదరాబాద్, 3. కాట్రగౌడ భాస్కర్ రెడ్డి
(34), కురుగోడు, బళ్లారి జిల్లా, కర్ణాటక రాష్ట్రం. పిట్ల నవీన్ (30), హైదారాబాద్, దూదిమెట్ల శ్రీధర్ (30), ఇందిరమ్మ కాలనీ, మిర్యాలగూడ చెందినవారిగా పోలీసులు గుర్తించారు.*
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ రెండు రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ మరియు మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు అనుమానస్పదంగా ఒక కారు తనీఖీ చేయగా అకారులో పురుగు మందల డబ్బాలను గుర్తించి పోలీసులు కారులో వున్న నిందితుల్లో ఒకడైనకాట్రగౌడ భాస్కర్ రెడ్డి అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్నట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించడంతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ నిమిత్తంగా నిన్నటి రోజున నిందితుడు కాట్రగౌడ భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ మరియు మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్లోని చర్లపల్లి ప్రాంతంలోని నిందితుల గోడౌన్ దాడి చేసి మిగితా నలుగురు నిందితులతో పాటు బెయర్, టాటా, కోర్టెవాతో మరో నాలుగు కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు, గడ్డి మందులను స్వాధీనం చేసుకోని నిందితులను విచారించగా పురుగు మందులకు అవసరమైన ముడి సరుకులను కోనుగోలు చేసిన వాటి ద్వారా డిమాండ్ వున్న కంపెనీ పేర్లతో నకిలీ పురుగు ఇగడ్డి మందులను తయారీ చేసి రైతులను మోసం చేసున్నట్లుగా నిందితులను అంగీకరించడంతో పోలీసులు అరెస్టు చేసి నకిలీ పురుగు,గడ్డి మందులు, లెబుల్స్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నిందితులను పట్టుకొవడం ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, టాస్క్ఫోర్స్, వరంగల్ ఏసిపిలు మధుసూధన్, నందిరాంనాయక్, టాస్క్ఫోర్స్, మట్టెవాడ ఇన్స్స్పెక్టర్లు సార్ల రాజు, గోపి, ఎస్.ఐలు భానుప్రకాశ్, లచ్చయ్య, సాంబయ్య, ఏఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుళ్ళు సురేష్, సాంబరాజు, సురేందర్, రమేష్ లను ను పోలీస్ కమిషనర్ అభినందించారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin