నల్లమలలోని గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు
నల్లమల అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ గ్రామ పరిధిలోని చెంచు పెంటలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం, సుశృత హాస్పిటల్ మహబూబ్ నగర్ మరియు శ్రీ దుర్గా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా విష జ్వరాలతో బాధ పడుతున్న చెంచులకు రక్త పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు.
ఈ శిబిరానికి డా.ఆకాశ్, డా.రాగిణి, యం.యం.గౌడ్, వివిద ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు జాన్ వెస్లి,కె. గోపాల్, పర్వతాలు,దేశ్య నాయక్,మల్లేష్,శంకర్ నాయక్,షబ్బీర్,గోపాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.