సైనిక్‌స్కూల్‌లో ప్రవేశానికిఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానం

0
Share

ఆల్‌ఇండియా సైనిక్‌ స్కూల్‌లో 2020-21 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరుకొండ సైనిల్‌స్కూల్‌ ప్రిన్సిపల్‌ వింగ్‌ కమాండర్‌ సీఎస్‌.భాను ఒక ప్రకటనలో తెలిపారు. బాలురు మాత్రమే అర్హులని చెప్పారు. 6వ తరగతిలో ప్రవేశానికి 21 మార్చి 2020 సంవత్సరం నాటికి 10 నుంచి 12 ఏళ్లు, 9వ తరగతిలో ప్రవేశానికి 13 నుంచి 15 ఏళ్లు కలిగి ఉండాలని, రాత, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామన్నారు. 6వ తరతిలో 60 సీట్లు, 9వ తరతిలో 20 సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. ఈనెల 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాలని సూచించారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం కేంద్రాల్లో 5 జనవరి 2020న పరీక్ష జరుగుతుందని చెప్పారు.
ఇతర వివరాల కోసం www.sainikschoolkorukonda.org వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *