• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

రైతు పింఛను పథకం ప్రారంభించిన మోడీ: నెలకు రూ.3వేలు, 5కోట్ల రైతులకు మేలు

Share Button

ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతులకు మరో తీపి కబురును అందించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ఆయన రాంచీలో గురువారం ప్రారంభించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే మూడేళ్లకు గానూ రూ. 10,774 కోట్లు కేటాయించింది.

60ఏళ్ల తర్వాత నెలకు రూ. 3వేలు
చిన్న, సన్న కారు రైతులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. 18 నుంచి 40ఏళ్ల మధ్యలో ఉన్న వ్యవసాయదారులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో పేరు నమోదు చేసుకున్న వారికి 60ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3వేల పింఛనును కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఇది వాలంటరీ స్కీమ్ కావడంతో నచ్చిన రైతులు ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరిన వారు నెలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల పేరిట చెల్లిస్తుంది. ఈ రెండు మొత్తాలను 60ఏళ్లు నిండిన తర్వాత రైతులకు నెలకు రూ. 3వేలుగా ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat