బంగారు “సింధు”రం

భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజం పి.వి.సింధు విజయం సాధించడంపై ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ , ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు ఆమెను అభినందించారు.