జనవరి 21 నుండి 24 వరకు ప్రజా పాలన గ్రామసభలు

0
Share

జనవరి 21 నుండి 24 వరకు
ప్రజా పాలన గ్రామసభలు…

ప్రజలు ఎవ్వరు కూడా అయోమయానికి గురికావద్దు

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి…

MLA డా. చిక్కుడు వంశీకృష్ణ

•రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు అయిన ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు ఇండ్ల కోసం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించడం జరుగుతుంది…

|నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రామ సభల్లో పాల్గొని…
సంక్షేమ పథకాలు పొందడానికి అర్హత ఉండి ఉన్నవాళ్లు గ్రామ సభల్లో మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి..

•ఎవరు కూడా అయోమయాన్ని గురికావద్దు గ్రామ సభలలో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయం చేసుకుంటూ అర్హులు అనర్హులను గుర్తించి ఈ యొక్క లబ్ధిదారులను ఎంపిక చేయాలి..

గ్రామసభలలో అధికారులు ప్రకటించిన లిస్టులో అవి ఫైనల్ కావు

నిజమైన లబ్ధిదారులు ఎవరన్నా రానివారు ఉంటే వెంటనే ప్రజా గ్రామసభలలో సంబంధిత అధికారులకు అప్లికేషన్ చేసుకోవాలి..

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులైన వారు తప్పకుండా మీ యొక్క అప్లికేషన్స్ అధికారులు తీసుకుంటారు…

అదికారులు కూడా గ్రామసభలలో ప్రజలకు వారు అడిగిన విధంగా సమాధానం చెబుతూ అప్లికేషన్స్ తీసుకోగలరు…

గ్రామ సభల్లో పాల్గొంటున్న అధికారులు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలలో పాల్గొని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలి….


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *